
సమ్మర్ హాలిడేస్ అయిపోయి పదిరోజులు అయ్యింది.. హాలిడేస్ లో ఆటపాటలతో ఎంజాయ్ చేసిన పిల్లలు క్రమక్రమంగా స్కూల్ బాట పట్టారు.. ఇప్పుడిప్పుడే స్కూల్ మోడ్ కి వస్తున్నారు. హోమ్ వర్క్, ట్యూషన్ అంటూ బిజీ అవుతున్నారు. హాలిడేస్ లో పిల్లల అల్లరితో విసిగిపోయిన తల్లులు కూడా రిలాక్స్ అవుతున్నారు. అంతా మారింది కానీ.. ఈ సార్ గారికి మాత్రం ఇంకా సమ్మర్ హాలిడేస్ మత్తు వదిలినట్లు లేదు.. పిల్లలకు క్లాస్ చెప్పాల్సిన టైంలో ఎంచక్కా టేబుల్ మీద కళ్ళు చాచి మరీ.. నిద్రపోతున్నారు. డిస్టర్బ్ చేస్తే ఎక్కడ కొడతారో అని బయపడ్డారో ఏమో.. పిల్లలు సైలెంట్ గా చూస్తూ కూచున్నారు. ఓ నెటిజన్ ఈ సీన్ ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని గాడేగావ్ గ్రామంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్ లో టీచర్ పిల్లలకు పాఠాలు చెప్పకుండా గుర్రు పెట్టి నిద్రపోతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ దృశ్యాన్ని వీడియో తీసిన నెటిజన్ " మీ సార్ ఎంతసేపటి నుంచి నిద్రపోతున్నారని " అడుగగా.. అరగంట నుంచి నిద్రపోతున్నారని సమాధానం ఇచ్చారు పిల్లలు.
टेबलवर पाय ठेवून शिक्षक भर वर्गात विद्यार्थ्यांसमोरच झोपले; जालन्याच्या जाफराबाद तालुक्यातील गाडेगव्हाण येथील जिल्हा परिषद शाळेतील प्रकार !
— Edu Varta (@EduvartaNews) June 20, 2025
.
.
.#jalna #jalnanews #zpschool #zpschoolteacher #eduvarta #educationalnews #viralvideo pic.twitter.com/TWzaPNupeo
ప్రభుత్వం ఇచ్చే జీతాలు తీసుకుంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఇలాంటోళ్లను కఠినంగా శిక్షించాలని కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్. పిల్లల భవిష్యత్తు తీర్చి దిద్దాల్సింది పోయి మొద్దు నిద్రపోతున్న ఇతను మనిషేనా అంటూ కామెంట్ చేస్తున్నారు ఇంకొంతమంది.