పౌరసత్వ చట్టంపై విరాట్ కోహ్లీ కామెంట్స్…

పౌరసత్వ చట్టంపై విరాట్ కోహ్లీ కామెంట్స్…

అస్సాం: పౌరసత్వ చట్టంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. అస్సాంలోని గువాహాటిలో ఈనెల7న శ్రీలంకతో మొదటి టీ20 మ్యాచ్  జరగనుంది. అయితే ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు కోహ్లీ. పౌరసత్వ చట్టంపై ఓ విలేఖరి అడిగిన ప్రశ్నకు సమాదానం ఇచ్చారు. తనకు పౌరసత్వ చట్టం గురించి పూర్తి వివరాలు తెలియవని అన్నారు. పూర్తి సమాచారం తెలిశాకే మాట్లాడతానని చెప్పారు. అస్సాంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా చేసిన ర్యాలీలు హింసాత్మకంగా మారాయని దాని ప్రభావం మీ మ్యాచ్ పై పడే అవకాశముందా అని అడిగిన ప్రశ్నకు…. తాము అలాంటి హింసాత్మక పరిస్థితిని ప్రస్తుతం అస్సాంలో చూడలేదని అన్నారు. ఇప్పుడు అస్సాం పూర్తి శాంతియుతంగా ఉందని చెప్పారు.