కోహ్లీ@254 నాటౌట్..ఇండియా 601 డిక్లేర్

కోహ్లీ@254 నాటౌట్..ఇండియా 601 డిక్లేర్

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు టీమిండియా అద్భుతంగా రాణిస్తుంది. ఓవర్ నైట్ స్కోర్ 273/3 వికెట్లతో రెండో రోజు  బ్యాటింగ్ కు దిగిన  కెప్టెన్ కోహ్లీ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  కోహ్లీకి ఇది ఏడవ డబుల్ సెంచరీ. అలాగే టెస్టుల్లో 7 వేల రన్స్ పూర్త ిచేసుకున్నాడు.  జడేజా 91 పరుగులు చేసి ఔటయ్యాడు. టీమిండియా 156 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి  601 పరుగులు చేసి ఫస్ట్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది.  ఇక వీరాట్ కోహ్లీ 33 ఫోర్లు,2 సిక్సులతో చెలరేగా ఆడుతూ 254 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.