న్యూఢిల్లీ: వరల్డ్కప్ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విరాట్ కోహ్లీ వన్డే టీమ్ పగ్గాలు కూడా వదులుకునే అవకాశం కనిపిస్తోంది. అతని ప్లేస్లో రోహిత్ శర్మ లిమిటెడ్ ఓవర్లకు ఫుల్టైమ్ కెప్టెన్ కానున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు సెలెక్షన్ కమిటీతో బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ, సెక్రటరీ జై షా ఒకటి రెండు రోజుల్లో వర్చువల్గా సమావేశమై వన్డే కెప్టెన్గా కోహ్లీ ఫ్యూచర్పై కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. వచ్చే జూన్ వరకు హోమ్ సీజన్లో ఇండియాకు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఉన్నాయి. అలాగే, 2023లో జరిగే వన్డే వరల్డ్కప్నకు ఇప్పటి నుంచే రెండేళ్ల మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ఈ క్రమంలోనే వైట్బాల్ ఫార్మాట్కు రోహిత్ను ఫుల్టైమ్ కెప్టెన్ చేయాలని చూస్తోంది. కాగా, ఈ నెల 17వ తేదీ నుంచి సొంతగడ్డపై న్యూజిలాండ్తో జరిగే టీ20 సిరీస్లో ఇండియాను రోహిత్ నడిపించడం లాంఛనమే. ఈ సిరీస్లో కోహ్లీ,లోకేశ్, బుమ్రా, షమీకి రెస్ట్ ఇవ్వనున్న సెలెక్టర్లు.. ఫామ్ కోల్పోయిన హార్దిక్, భువీపై వేటు వేయనున్నారు. ఐపీఎల్ హీరోలు రుతురాజ్, వెంకటేశ్ అయ్యర్కు చాన్స్ రావొచ్చు.