ఐపీఎల్ ఆడకు...సెహ్వాగ్ సీరియస్..

ఐపీఎల్ ఆడకు...సెహ్వాగ్ సీరియస్..

ఐపీఎల్ 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ సారథి డేవిడ్ వార్నర్ పై టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అసహనం వ్యక్తం చేశాడు. వార్నర్ ఆటతీరు, కెప్టెన్సీపై సెహ్వాగ్ విమర్శలు గుప్పించాడు. కెప్టెన్సీ చేయడం రాకపోతే..వేగంగా పరుగులు చేయడం చేతకాకపోతే ఐపీఎల్ ఆడొద్దని హితవు పలికాడు. 

సరిగా ఆడు...లేదంటే తప్పుకో...

ఈ ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ చాలా నిదానంగా ఆడుతున్నాడని సెహ్వాగ్ అన్నాడు. 25 బంతుల్లో 50 పరుగులు చేయాలి కానీ..నెమ్మదిగా ఆడొద్దని సూచించారు. అందుకే వార్నర్ కు చెప్తున్నానని..అతనికి బాధ కలిగినా సరే చెప్పక తప్పదన్నాడు. వార్నర్..ఉత్తమ ఆటతీరు ప్రదర్శించు అని సెహ్వాగ్ చెప్పాడు. యశస్వీ జైస్వాల్ ను చూసి వార్నర్ నేర్చుకోవాలని హితవు పలికాడు. వేగంగా ఆడకపోతే మాత్రం ఐపీఎల్ ఆడొద్దన్నాడు. 55 బంతుల్లో 65 పరుగులు చేయడం కన్నా..30 పరుగులే చేసి ఔటైతే జట్టుకు మేలు జరుగుతుందన్నాడు. ఆ తర్వాత వచ్చే బ్యాట్స్ మన్  అయినా వేగంగా ఆడతారని చెప్పుకొచ్చాడు. దాని వల్ల ఫలితం మారే అవకాశం ఉందన్నాడు. 

గతంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపిన వార్నర్..ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు. అయితే రిషబ్ పంత్ ప్రమాదం కారణంగా దూరం కావడంతో..వార్నర్ ఢిల్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. వార్నర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్..ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. అటు కెప్టెన్సీలో విఫలమైన వార్నర్..దూకుడైన ఆటతీరును కనభర్చడంలో విఫలమయ్యాడు. ఈ క్రమంలో వార్నర్ కెప్టెన్సీ, సారథ్యంపై సెహ్వాగ్ విమర్శలు చేశాడు.