బాలయ్య అభిమానుల రచ్చ..సినిమా బంద్

బాలయ్య అభిమానుల రచ్చ..సినిమా  బంద్

నందమూరి బాలకృష్ణ సినిమాకు వర్జినియా పోలీసులు షాకిచ్చారు. భారీ అంచనాలతో సంక్రాంతి కానుకగా రిలీజైన బాలయ్య వీరసింహారెడ్డి చిత్ర ప్రదర్శనను పోలీసులు నిలిపేశారు. ఓ థియేటర్లో సినిమా నడుస్తుండగా బాలయ్య అభిమానులు కాగితాలు చించి విసిరేస్తూ రచ్చ రచ్చ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన థియేటర్ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు థియేటర్లో ఇలాంటివి అంగీకరించేదిలేదని  సినిమా ప్రదర్శనను నిలిపివేశారు.

ప్రేక్షకులతో కలిసి సినిమా చూసిన బాలయ్య 

కూకట్పల్లిలోని భ్రమరాంబ థియేటర్లో బాలయ్య సందడి చేశారు. మూవీ టీమ్తో కలిసి బెనిఫిట్ షో చూసేందుకు బాలయ్య థియేటర్కు వచ్చారు. అభిమానులు ఆయనకు బ్యాండ్ బాజాలతో ఘనస్వాగతం పలికారు.  జై బాలయ్య అంటూ నినాదాలతో హోరెత్తించారు. అభిమానులతో సినిమా చూడటం ఆనందంగా ఉందని బాలయ్య తెలిపారు. గోపిచంద్‌ మలినేని డైరక్షన్ లో తెరకెక్కిన వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన శ్రుతిహాసన్‌ హీరోయిన్‌గా నటించింది.మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందించింది. తమన్  సంగీతం అందించాడు.