ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?

ఏమైందీ : రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు..క్షమాపణలు చెప్పిన విశాల్..కారణం ఏంటంటే.?

విశాల్(Vishal) హీరోగా ‘సింగం’ ఫేమ్ హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రత్నం’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. గతంలో వీరిద్దరి కాంబోలో నుంచి వచ్చిన మాస్ బ్లక్ బ్లాస్టర్స్ భరణి, పూజ చెప్పాల్సిన పనిలేదు. ఓ రేంజ్ లో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు రాబోయే రత్నం మూవీపై కూడా భారీ అంచనాలు వున్నాయి. రీసెంట్ గా ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు బోర్డర్ బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమాను తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. 

ఈ సినిమాను తెలుగు,త‌మిళ భాష‌ల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఏప్రిల్ 26న రీలిజ్ కానుంది.ఇపుడు రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు మేకర్స్. ఇదిలావుంటే..రత్నం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ఈ ఈవెంట్ ను శుక్రవారం (ఏప్రిల్ 19న‌) తెలుగులో భారీ ఎత్తున్న ప్లాన్ చేసిన సంగ‌తి తెలిసిందే.ఇందుకోసం హైద‌రాబాద్‌లోని నరసింహ రెడ్డి కాలేజీని ఈవెంట్ వేదికగా ఎంచుకున్నారు.

తాజాగా ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయిన‌ట్లు హీరో విశాల్ ప్ర‌క‌టించారు. దీనిపై తన ఎక్స్ ఖాతాలో స్పెష‌ల్ నోట్ రిలీజ్ చేశాడు. "అనుకోకుండా ‘రత్నం’ మూవీ ప్రీ రిలీజ్ వేడుక వాయిదా ప‌డింది ఈ విష‌యంపై ముందుగా అభిమానులకు, సినీ ప్రేక్షకులకు  క్షమాపణలు చెబుతున్న. మీ అందరిని కలిసి మీతో గడిపే అద్భుతమైన సమయం అనివార్య కారణాలతో కోల్పోయినందుకు నేను చింతిస్తున్నాను. నేను దీన్ని త్వరలో భర్తీ చేస్తానని..అలాగే ఈ ఈవెంట్‌ను మ‌రింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తానని మాటిస్తున్నాను. అంటూ విశాల్ నోట్ లో రాసుకోచ్చాడు.

ఈ చిత్రంలో గౌతమ్ మీనన్,  సముద్రఖని, యోగిబాబు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. స్టోన్ బెంచ్‌‌ ఫిలిమ్స్‌‌, జీ స్టూడియోస్‌‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.