శ్రీధర్ రెడ్డి పార్థివదేహానికి వివేక్ వెంకట స్వామి నివాళులు

శ్రీధర్ రెడ్డి పార్థివదేహానికి వివేక్ వెంకట స్వామి నివాళులు

శ్రీధర్ రెడ్డి సీనియర్ లీడర్., మలిదశ ఉద్యమ కారుడని.. ఆయన చనిపోవడం తెలంగాణకి చాలా లోటని మాజీ ఎంపీ, బీజేపీ  జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి తెలిపారు. బీఎన్ రెడ్డి కాలనీలోని శ్రీధర్ రెడ్డి కూతురు కృష్ణ శ్రీ స్వగృహంలో ఆయన మృతదేహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి..సంతాపం తెలిపారు. 1969 లో కీలక పాత్ర పోషించినట్లు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందంటూ యూనివర్సిటీలోని విద్యార్థులందరని ఏకం చేశారన్నారు.

తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా యూనివర్శిటీ నాటి విద్యార్థి సంఘం నేత  శ్రీధర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..తుదిశ్వాస విడిచారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.