- అభి, హెడ్, కిషన్ మెరుపుల్లేవ్
- ఫస్ట్ మ్యాచ్లో ఓటమితో నిరుత్సాహం
ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ ఓడిపోవడంతో ఫ్యాన్స్నిరుత్సాహానికి గురయ్యారు. చాలా రోజుల తర్వాత తమ అభిమాన జట్టు ఆటను ఆస్వాదించాలని ఉప్పల్కు పోటెత్తిన అభిమానులకు నిరాశ తప్పలేదు. మహామహులుగా పేరున్న అభిషేక్శర్మ, హెడ్, ఇషాన్ కిషన్ వచ్చినట్టే వచ్చి పెవిలియన్ చేరడంతో అసంతృప్తికి గురయ్యారు.
క్లాసెస్, నితీష్కుమార్రెడ్డి ఏడు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లు బాది 156 పరుగులకు చేర్చడంతో కాస్త సంతృప్తి చెందారు. చివరకు, లక్నో జట్టు మ్యాచ్గెలవడంతో దిగాలుగా ఇంటిబాట పట్టారు.
