కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి

కామారెడ్డి: కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. జుక్కల్ నియోజకవర్గ కేంద్రంలో పల్లె గోస బీజేపీ భరోసా యాత్రలో పాల్గొన్న ఆయన.. కేసీఆర్ సర్కారుపై ఫైర్అయ్యారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ను కమిషన్ల రావు అని పిలవాలని వివేక్ వెంకటస్వామి చురకలంటించారు. టీఆర్ఎస్  హయాంలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారితే.. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బంగారుమయమైందని విమర్శించారు. 

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ను ఓడించాలని వివేక్ వెంకట స్వామి పిలుపునిచ్చారు. ఒకవేళ కేసీఆర్ పార్టీని సాగనంపకపోతే ప్రజల కష్టాలు మరింత పెరుగుతాయని అన్నారు. ప్రజల సొమ్ముతో కేసీఆర్ కుటుంబం విలాసాలు చేస్తోందని, దళిత ముఖ్యమంత్రి, దళిత బంధు, డబుల్ బెడ్రూం హామీలు కేసీఆర్ నెరవేర్చలేదని విమర్శించారు.  ప్రజలంతా కొవిడ్ తో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఫార్మ్ హౌస్ లో రెస్ట్ తీసుకున్న మూర్ఖుడు సీఎం కేసీఆర్ అని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు.