మెగాస్టార్ చిరంజీవి 154వ మూవీ ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. సినిమా కోసం అభిమానులు అతృతగా వెయిట్ చేస్తున్నారు. ఇక యూఎస్ లో ప్రీ బుకింగ్స్ సేల్స్ స్టార్ట్ అయ్యాయి. విపరీతమైన డిమాండ్ నెలకొంది. రిలీజ్కు 10 రోజులు ఉండగానే టిక్కెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 100K డాలర్స్ను క్రాస్ చేసింది.
ఈ మూవీలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్గా నటించింది. ఈ చిత్రంలో రవితేజ కీలకపాత్ర పోషిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు భారీగా పెంచుతున్నాయి. ఇక వైజాగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా బాస్ పార్టీ స్పెషల్ సాంగ్లో మెరువబోతుంది. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.