'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ వేదిక కష్టాలు

'వాల్తేరు వీరయ్య' ప్రీ రిలీజ్ వేదిక కష్టాలు

మెగాస్టార్ చిరంజీవి, శృతిహాసన్ నటించిన మూవీ ‘వాల్తేరు వీరయ్య’. ఈ సినిమా ప్రీ రిలీజ్ విషయంలో మరో కొత్త ఆప్ డేట్ వచ్చింది. ముందుగా అనుకున్న విధంగానే విశాఖ ఆర్కే బీచ్ తీరంలోనే ‘వాల్తేరు వీరయ్య’ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. 

ముందుగా ప్రభుత్వ అనుమతులు లేకపోవడంతో ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన వేదికను నిన్న మధ్యాహ్నం తొలగించారు. దీంతో ఆంధ్ర యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సభ నిర్వహణకు సమాయత్తమవుతున్న సమయంలో మళ్లీ వేదిక మారినట్లు తెలుస్తోంది. విశాఖ ఆర్కే బీచ్ లోనే ఈవెంట్ నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 

ప్రభుత్వ నిర్ణయం వల్ల ఆర్కే బీచ్ లో నిర్మించిన వేదికను తొలగించి... మళ్లీ నిర్మించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్లాజీ చెప్పారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది.