సీఎం పదవి వద్దనుకున్నా.. నన్ను వదలడం లేదు : అశోక్ గెహ్లాట్

సీఎం పదవి వద్దనుకున్నా.. నన్ను వదలడం లేదు : అశోక్ గెహ్లాట్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  సీఎం పదవి నుంచి తప్పుకుందామని ఉన్నా ఆ పదవి తనను వదలడం లేదన్నారు.  ఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  ఈ కామెంట్స్ చేశారు.  సోనియా గాంధీ జాతీయ అధ్యక్షురాలు అయ్యాక ఆమె తీసుకున్న తొలి నిర్ణయం తనను సీఎం చేయడమేనని చెప్పారు. తాను అసలు సీఎం అభ్యర్థి కాకపోయినా సోనియా తనను ఎంపిక చేశారన్నారు. 

తాను సీఎం పదవిని వదలాలి అనుకున్నా అది తనను వదలడం లేదని, భవిష్యత్తులో కూడా తనని విడిచిపెట్టదు కూడా అని చెప్పారు. తాను నాలుగోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా తనతో చెప్పారని గెహ్లాట్  అన్నారు. ఒకటి రెండు రోజుల్లో  కాంగ్రెస్ తొలి జాబితాను రిలీజ్ చేయనున్నట్లుగా గెహ్లాట్  తెలిపారు .  కాగా  నవంబర్‌ 25న రాజస్థాన్ లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. డిసెంబర్‌ 3న కౌంటింగ్‌ ఉంటుంది.