నర్సంపేట, వెలుగు: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురంలో ఇటీవల జరిగిన వివాహిత మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. నర్సంపేట ఏసీపీ ఆఫీసులో మంగళవారం ఏసీపీ రవీందర్రెడ్డి కేసు వివరాలను వెల్లడించారు.
దుగ్గొండి మండలం లక్ష్మీపురంకు చెందిన తాళ్లపల్లి సుమలత ఈ నెల 20న అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఆమె భర్త ఐదేళ్ల కింద చనిపోగా, అదే గ్రామానికి చెందిన పాండవుల సురేశ్తో వివాహేతర సంబంధం కొనసాగుతోంది. కొద్ది రోజులుగా సురేశ్ను పట్టించుకోకపోవడం, ఫోన్ బిజీ వస్తుండడంతో సుమలతపై అనుమానం పెంచుకున్నాడు.
ఈక్రమంలో సుమలతను చంపాలని ప్లాన్ చేసి, ఈ నెల 20న వరంగల్కు రమ్మని పిలిచాడు. సాయంత్రం ఇద్దరు కలిసి బైక్పై వరంగల్ నుంచి బైక్పై లక్ష్మీపురం బయలుదేరారు. కాశీబుగ్గలో కత్తి కొనుగోలు చేసి బైక్లో పెట్టుకున్నాడు.
లక్ష్మీపురం శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ వద్దకు రాగానే మరొకరితో చనువుగా ఉంటున్నావని సుమలతతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఉన్న సురేశ్ఆమెపై కత్తితో దాడి చేశాడు. గొంతు కోసి చంపి పరారయ్యాడు. కాల్ డేటా, సీసీ పుటేజీ ఆధారంగా విచారణ చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు ఏసీపీ తెలిపారు.
