వరంగల్సిటీ, వెలుగు : మోసాలకు కేరాఫ్ కాంగ్రెస్, బీఆర్ఎస్ అని వరంగల్ తూర్పు నియోజకవర్గ క్యాండిడేట్ ఎర్రబెల్లి ప్రదీప్రావు విమర్శించారు. శుక్రవారం వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వరకు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలను అందజేశారు.
అంతకుముందు ఆయన మాట్లాడుతూ తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాగూర్, మాజీ మేయర్ టి.రాజేశ్వర్రావు, నాయకులు కుసుమ సతీశ్, వన్నాల వెంకట్ రమణ, శ్రీరాములు, గంట రవికుమార్, అల్లం నాగరాజు పాల్గొన్నారు.