కాంగ్రెస్ లో చేరిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్

కాంగ్రెస్ లో చేరిన వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్

వర్ధన్నపేట, వెలుగు : వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపల్ చైర్ పర్సన్ ఆంగోతు అరుణతో పాటు కౌన్సిలర్లు మంచాల రామకృష్ణ, తుమ్మల రవీందర్ కాంగ్రెస్ లో చేరారు. ఎమ్మెల్యే నాగరాజు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్-ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ సమక్షం లో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అయితే చైర్ పర్సన్ తో పాటు కౌన్సిలర్లు కాంగ్రెస్ లో చేరడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే బీఆర్ఎస్, కాంగ్రెస్

బీజేపీ కౌన్సిలర్లు 9 మంది కలసి చైర్ పర్సన్ పై అవిశ్వాసం పెట్టారు. చివరికి కొందరు కౌన్సిలర్లు వెనక్కి తగ్గడంతో అవిశ్వాసం వీగిపోయింది. అవిశ్వాసం వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన ఓ కౌన్సిలర్ భర్త కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కూడా ప్రయత్నాలు చేశారు.

అయితే అప్పుడు అవిశ్వాస ప్రక్రియతో పాటు కౌన్సిలర్లు పార్టీ మారే ప్రయత్నాన్ని అడ్డుకున్న ఐనవోలుకు చెందిన ఓ కీలక నేత ఇప్పుడు తానే తెర వెనక ఉండి మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్లను కాంగ్రెస్ లో చేర్పించినట్లు సమాచారం. రేపో మాపో ఆయన కూడా హస్తం గూటికి చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది.