టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది

టేకాఫ్ అయిన 20 నిమిషాల్లోనే క్రాష్ అయింది
  • నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి 

నల్గొండ : పెద్దవూర మండలం తుంగతుర్తి పరిధిలో ట్రైనీ హెలికాఫ్టర్ కుప్పకూలిన ప్రమాదంపై జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి స్పందించారు. ట్రైనీ చాపర్ ప్రమాదంలో శిక్షణ పొందుతున్న మహిళా పైలట్ తమిళనాడుకు చెందిన మహిమ స్పాట్ లోనే చనిపోయిందన్నారు. "సెస్నా 152"ఎయిర్ క్రాఫ్ట్ చాపర్ ను ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తున్నారని ఆమె వెల్లడించారు. ఈ హెలికాఫ్టర్ గుంటూరు జిల్లా మాచర్ల వద్ద గల ప్రైవేట్ ఏవియేషన్ అకాడమీకి చెందిన చాపర్ గా గుర్తించామన్నారు. 
‘‘చాపర్ మాచర్లలో 10.30 ని.కు టేకాఫ్ అయ్యింది.. 20 నిమిషాల వ్యవధిలోనే ఎయిర్ లోనే క్రాష్ అయ్యింది.. ప్రమాదానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం’’ అని జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి వివరించారు.