- తెలంగాణ న్యాయమూర్తుల సంఘం
హైదరాబాద్, వెలుగు : మెట్రో పాలిటన్ కోర్టు ఎక్సైజ్ మేజిస్ట్రేట్ మణికంఠ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం ప్రకటించింది. సోమవారం హైదరాబాద్ అంబర్పేటలోని మణికంఠ నివాసానికి వెళ్లి పలువురు న్యాయమూర్తులు, న్యాయమూర్తి సంఘం ప్రతినిధులు, సిబ్బంది మణికంఠ చిత్రపటానికి నివాళులు అర్పించి, ఆయన తల్లిదండ్రులను పరామర్శించారు.
చిన్న వయసులో న్యాయమూర్తిగా ఎంపికైన మణికంఠ సౌమ్యుడు, వివాద రహితుడిగా పేరు పొందాడన్నారు. మంచి భవిష్యత్తు కలిగిన యువ న్యాయమూర్తి మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని సంఘం ప్రతినిధులు తెలిపారు.