హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మాకు ఓకే

హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా మాకు ఓకే

నాగార్జునసాగర్‌ బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి విభేదాల్లేవన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌. సాగర్‌ ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీయేనని స్పష్టం చేశారు. ఉపఎన్నికల సందర్భంగా నాగార్జునసాగర్‌ బీజేపీ నేతలతో సంజయ్‌ సమావేశమయ్యారు. ఉపఎన్నిక, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై నేతలతో సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో శక్తిమంతమైన పార్టీగా ఎదుగుతోందని.. సాగర్‌లో ఆ పార్టీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. టికెట్‌ తమకే రావాలని నాయకులు కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదన్నారు. టికెట్‌ ఎవరికి వచ్చినా పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. అంతేకాదు పార్టీ గెలుపు కోసం కలిసి పనిచేసుకోవాలని సాగర్‌ నేతలకు సూచించారు బండి సంజయ్.