రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి పెద్ద నాయకులను అందించిన జిల్లాగా నిజామాబాద్కు ఉన్న లెగసీని కంటిన్యూ చేస్తాం. అర్గుల్ రాజారామ్, రాంగోపాల్ రెడ్డి, డి.శ్రీనివాస్, సంతోష్ రెడ్డి వంటివారు పార్టీకి అసమాన సేవలు అందించారన్నారు. నగరంలోని పురాతన గంజ్ మార్కెట్కు స్టేట్లోనే గొప్ప పేరుంది.1931లో ఏర్పడిన నిజామాబాద్ మున్సిపాలిటీని ఎంపీ అర్వింద్ స్మార్ట్ సిటీ చేయించకపోవడంతో నష్టం జరుగుతున్నది.
సెకెండ్ ఫేజ్లో నిర్ణయించే ఎయిర్పోర్టుల్లో నిజామాబాద్కు చోటు కల్పిస్తే హైదరాబాద్, ముంబై, నాగ్పూర్కు కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి చెందుతుంది. నేషనల్ క్రీడాకారులను అందించిన జిల్లాను స్పోర్ట్ హబ్ చేయాలి. టూరిజానికి బాగా స్కోప్ ఉన్న నిజామాబాద్కు అధిక ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేయాలి.
ఎన్ని రేషన్ కార్డులైనా ఇస్తం : మంత్రి ఉత్తమ్
దేశంలో ఏ రాష్ట్రంలో లేని రీతిలో పేద కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఘనత సీఎం రేవంత్రెడ్డి సర్కారుది. గత బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో నిజామాబాద్ జిల్లాలో 2.50 లక్షల కార్డులు మాత్రమే ఉండేవి. కొత్తగా ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. అర్హులైన పేదలకు కొత్త కార్డులిచ్చి కాంగ్రెస్ సర్కార్ వాటిని 3.15 లక్షలకు పెంచింది. ఇంకా ఎంత మంది పేదవారికి ఇవ్వడానికైనా రెడీగా ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 4.25 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమేకొని.. రూ.923 కోట్లు చెల్లించారు. మా పాలనలో 7 లక్షల మెట్రిక్ టన్నులుకొని బోనస్ కలిపి రూ.2 వేల కోట్ల పేమెంట్ చేశాం.
ఉమ్మడి జిల్లాకో పామాయిల్ ఫ్యాక్టరీ : - మంత్రి తుమ్మల
వరిసాగులో రికార్డు సృష్టించిన మన రాష్ట్రం.. ఆయిల్పామ్ సాగులో కూడా ఫస్ట్ ప్లేస్ సాధించబోతున్నది. ఇప్పుడున్న 3 లక్షల ఎకరాల ఆయిల్పామ్ సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం. ప్రతి ఉమ్మడిజిల్లాకో పామాయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం. రైతును రాజును చేయడమే తమ లక్ష్యం. వ్యవసాయ పరంగా ముందంజలో ఉన్న నిజామాబాద్కు వ్యవసాయ కాలేజీ ఇచ్చాం.
