ఎవరడ్డొచ్చినా నల్లగొండలో సభ నిర్వహిస్తం : కేసీఆర్

ఎవరడ్డొచ్చినా నల్లగొండలో సభ నిర్వహిస్తం : కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు ఈ నెల 13న నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. ఇవాళ తెలంగాణ భవన్ లో కృష్ణా బేసిన్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రజా ప్రతినిధులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేకఖ వైఖరిని అలంబిస్తోందన్నారు. 

నాడు ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్న రీతిలోనే సాగునీటి హక్కుల కోసం పోరాడుతామని స్పష్టం చేశారు.  రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అనాలోచిత వైఖరి కృష్ణా బేసిన్ లోని దక్షిణ తెలంగాణ రైతాంగ సాగునీటి హక్కులపై గొడ్డలి పెట్టులా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రేస్ ప్రభుత్వ అవగాహన రాహిత్యం తో  సంతకాలు చేసి తీసుకున్న నిర్ణయం వల్ల భవిష్యత్తులో ప్రాజెక్టుల కట్టలమీదికి కూడా పోలేని పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం  చేసారు. దీన్ని ప్రజా మద్దతు తో తిప్పికొడుతామన్నారు.