కోల్కతా: ప్రముఖ క్రికెటర్ మనోజ్ తివారీ పొలిటికల్ ఎంట్రీకి అంతా సిద్ధమైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వనున్నట్లు తివారీ ప్రకటించాడు. ఈ ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో తృణమూల్, బీజేపీలు చేరికలపై దృష్టి పెట్టాయి. ఈ నేపథ్యంలో ఛోటా దాదాగా పేరు గడించిన మనోజ్ తివారీ టీఎంసీలో జాయిన్ అవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హుగ్లీలోని చిన్సురాలో పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో తివారీ టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు.
ఇక తివారీ క్రికెట్ కెరీర్ విషయానికి వస్తే.. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, రైజింగ్ పూణె సూపర్ జెయింట్స్ జట్లకు అతడు ప్రాతినిధ్యం వహించాడు. వెస్ట్ బెంగాల్ స్టేట్ టీమ్కు కెప్టెన్గా వ్యవహరించిన తివారీ.. టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. తన రాజకీయ అరంగేట్రం గురించి తివారీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశాడు. ‘ఇవాళ్టి నుంచి కొత్త ప్రయాణం మొదలవుతోంది. మీ అందరి ప్రేమ, మద్దతు కావాలి’ అని తివారీ పేర్కొన్నాడు.
A new journey begins from today. Need all your love & support. From now onwards this will be my political profile on Instagram.https://t.co/uZ9idMW7lD
— MANOJ TIWARY (@tiwarymanoj) February 24, 2021