బిగ్‌బాస్ షో తర్వాత శ్రీముఖి ఎక్కడుంది? ఏంచేస్తుంది?

బిగ్‌బాస్ షో తర్వాత శ్రీముఖి ఎక్కడుంది? ఏంచేస్తుంది?

టెలివిజన్ రంగంలో తన యాంకరింగ్‌తో ప్రతి ఇంట్లో తనకంటూ ఓ అభిమాని ఉండేలా తయారుచేసుకుంది శ్రీముఖి. చాలామందికి ఆమె నటన, యాంకరింగ్ అంటే ఎంతో పిచ్చి. తెలుగులో ప్రసారమైన ‘బిగ్‌బాస్ 3’కి కంటెస్టెంట్‌గా వచ్చిన శ్రీముఖి.. హౌజ్‌లోని మిగతా సభ్యులందరికీ గట్టి పోటీని ఇచ్చింది. హౌజ్‌లో 105 రోజులు ఉన్న శ్రీముఖి చివరికి రన్నర్ అప్‌గా నిలిచింది. రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ విన్నర్‌గా నిలిచాడు.

షో నడుస్తున్న సమయంలో హోస్ట్ నాగార్జున శ్రీముఖిని ఉద్దేశించి నువ్వు విన్నర్ అయితే ప్రైజ్ మనీ ఏం చేస్తావు అని అడిగాడు. దానికి సమాధానంగా శ్రీముఖి, ‘నేను గెలిస్తే ఆ డబ్బంతా మా అమ్మానాన్నలకు ఇస్తా… నాకు ఇష్టమైన మాల్దివులకు వెళ్తా’ అని చెప్పింది. చెప్పినట్లుగా టైటిల్ గెలవకపోయినా… శ్రీముఖి మాత్రం తన స్నేహితులతో కలిసి మాల్దివులకు వెళ్లి ఎంజాయ్ చేస్తుంది. ఆర్జే చైతూ, యాంకర్ విష్ణుప్రియలతో పాటూ మరో ఇద్దరు శ్రీముఖితో ఉన్నారు. వారితో కలిసి నానిస్ గ్యాంగ్‌లీడర్ పాటకు చిందులేస్తూ తీసుకున్న వీడియోను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.