ఇద్దరు పిల్లలతో రైలు పట్టాలు దాటుతుండగా..

ఇద్దరు పిల్లలతో రైలు పట్టాలు దాటుతుండగా..

నల్లగొండ/గుంటూరు జిల్లా : నల్లగొండ పట్టణంలోని చైతన్యపురి కాలనీకి చెందిన రమ్యతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు రైలు ఢీకొని మృతి చెందారు. గుంటూరు జిల్లా నడికుడి రైల్వేస్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా సోమవారం   రాత్రి సుమారు ఏడున్నర గంటల ప్రాంతంలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ఢీకొనడంతో రమ్య (28),ఆమె పిల్లలు రిషిక్ రెడ్డి(8)' హంసిక(6)లు మృతిచెందారు. మృతదేహాలను గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఆస్పత్రి మార్చురీకి తరలించారు.
నడికూడి రైల్వే పోలీసులు నల్లగొండలోని ఆమె భర్త , కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో మంగళవారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు సత్తెనపల్లి కి తరలివెళ్లారు. ఈ సంఘటన ప్రమాదమా ? ఆత్మహత్య అనే విషయం తెలియాల్సి ఉంది. పిల్లలిద్దరూ నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డులో గల ప్రేరణ స్కూల్లో చదువుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.