కార్తీకమాసం నదుల్లో స్నానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది.. పురాణాల్లో ఏముంది..!

కార్తీకమాసం నదుల్లో  స్నానం చేస్తే ఎలాంటి శక్తి వస్తుంది.. పురాణాల్లో ఏముంది..!

కార్తీకమాసం కొనసాగుతుంది. చాలామంది నదీతీరాల్లో స్నానం చేస్తారు.  కార్తీకంలో ఎందుకు నదుల్లో స్నానం చేయాలి.. అలా చేయడం వలన ఎలాంటి శక్తి వస్తుంది.  పురాణాల్లో ఏముంది.. పండితులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం. . !

కార్తీకమాసం చాలా పవిత్రమైన మాసం... ఈ నెలలో తెల్లవారుజామున నదీస్నానం చేసి దీపారాధాన చేస్తే ఎంతో శక్తి వస్తుందని పండితులు చెబుతున్నారు.    శివకేశవులు అంటే.. పరమేశ్వరుడు.. విష్ణుమూర్తి  అనుగ్రహం కోసం భక్తులు పరితపిస్తుంటారు.  ఈ మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి దానం ఎంతో పుణ్యాన్నిస్తుందని  పురాణాలు చెబుతున్నాయి.  ఈ మాసంలో అత్యంత ముఖ్యమైన ఆచారం కార్తీక స్నానం ..  నదీ తీరాల్లో చెరువుల్లో తెల్లవారుజామునే భక్తితో చేసే ఈ స్నానం వెనుక ఉన్న మహత్తర శక్తి  ఉంది. 

ALSO READ : అరటి ఆకు అన్నం .. అద్భుతమైన ఆరోగ్యం..!


మనము రోజు చేసే స్నానం దేహాన్ని శుద్ది చేస్తే.. కార్తీకమాసంలో తెల్లవారుజామునే చేసే స్నానం ఆత్మను శుద్ది చేస్తుంది.   పురాణాల ప్రకారం ఈ మాసంలో సూర్యోదయానికి ముందే పవిత్ర నదులలో (గంగ, గోదావరి, కృష్ణ వంటి) స్నానం చేస్తే గత జన్మల్లో చేసిన పాపాలు కూడా తొలగిపోతాయి.

కార్తీక మాసంలోనే  శ్రీమహావిష్ణువు ‘క్షీరసాగరంలో’ యోగనిద్ర నుంచి మేల్కొంటాడు.  ఈ మాసంలో చేసే ప్రతి మంచి పనికి అపారమైన ఫలం లభిస్తుంది. త్రిమూర్తులుగా చెప్పే  బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు  ఈ మాసంలో నదీ జలాలలో కొలువై ఉంటారని పండితులు చెబుతున్నారు. అందుకే కార్తీక స్నానం ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక శక్తిని కూడా ప్రసాదిస్తుంది.

కార్తీక స్నానం విశిష్టత గురించి పద్మ పురాణం, స్కంద పురాణం వంటి గ్రంథాలలో వివరంగా ఉంది.  బ్రహ్మదేవుడు  కార్తీక స్నాన మహిమ గురించి ప్రస్తావించాడని చెబుతారు. కార్తీక మాసంలో పవిత్ర నదిలో స్నానం చేసి, సూర్య భగవానుడికి అర్ఘ్యం ఇచ్చి, దీపం వెలిగిస్తే.. ఆ వ్యక్తికి అన్ని తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం దక్కుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. అంతేకాక ఈ స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు లభిస్తాయని, సంతాన భాగ్యం లేని వారికి సంతానం కలుగుతుంది.  ఉపవాసం దీపారాధనతో పాటు కార్తీక స్నానం ఆచరిస్తే, శివకేశవుల అనుగ్రహం తప్పక లభిస్తుంది.

ఆరోగ్యం సహకరించనివారు లేదా నదీస్నానానికి అవకాశం లేనివారు తమ ఇంటి వద్దనే గోరువెచ్చని నీటిలో కొద్దిగా గంగాజలం లేదా తులసి దళాలు వేసుకుని ‘గంగా, గోదావరి, కృష్ణ నమః’ అని ప్రార్థించి స్నానం చేసినా శుభఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.