మళ్లీ ఆంధ్రావాళ్లు వస్తున్నపుడు ఇంక తెలంగాణ ఎందుకు?

మళ్లీ ఆంధ్రావాళ్లు వస్తున్నపుడు ఇంక తెలంగాణ ఎందుకు?

హైదరాబాద్‌: బీజేపీ డైరెక్షన్స్ లోనే షర్మిల కొత్త పార్టీతో వస్తుందని నా అనుమానం  అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర మాట్లాడుతూ.. రక్తం పంచుకున్న కూతురుతో రాజశేఖర్ రెడ్డి సీఎం అవలేదని .. కాంగ్రెస్ అభిమానులతో రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారన్నారు. షర్మిల ఒక గృహిణి ఆమెకి ఎటువంటి రాజకీయ అనుభవం లేదన్నారు. కాంగ్రెస్ ని దెబ్బకొట్టడానికే షర్మిల వస్తుందన్న జగ్గారెడ్డి..నీవు నిజంగా రాజశేకర్ రెడ్డి వారసురాలువు అయితే ..రాజన్న కోరిక నెరవేర్చలనుకుంటే ..కాంగ్రెస్ పార్టీలో చేరి రాజశేఖర్ రెడ్డి కల రాహుల్ గాంధీని ప్రధాని చేయడంలో భాగం కావాలన్నారు.

కాంగ్రెస్ ని ఎవరు దెబ్బ కొట్టలేరని.. కాంగ్రెస్ కి రాబోయే ఎన్నికల్లో 60 నుండి 70 సీట్లు వస్తాయన్నారు. ప్రభుత్వం కాంగ్రెస్ దేనన్న ఆయన..అన్న మాట చెల్లి వినదు ..చెల్లి మాట జగన్ వినడు అంటే ఎవరు నమ్ముతారన్నారు. వాళ్ళు ఒకరి మాట ఒకరు విననపుడు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎట్లా అవుతారని ప్రశ్నించారు. బీజేపీ స్క్రిప్ట్ ని కేసీఆర్, అమిత్ షా స్క్రిప్ట్ ని షర్మిల చదువుతోందన్నారు. ఈ నాలుగు పార్టీలకి.. షర్మిలకి.. తీగల మెగాకృష్ణ పండింగ్ చేస్తున్నారన్నారు. మళ్లీ తెలంగాణలో ఆంధ్రావాళ్లు  వస్తున్నపుడు ఇంకా తెలంగాణ ఎందుకు.. ఉమ్మడి రాష్ట్రంలో కలిపేయండన్నారు. చంద్రబాబు, కేసీఆర్ .. షర్మిల పార్టీపై ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రాజకీయ క్రీడ ఆడుకోవడానికి హైదరాబాద్ ని బాల్ లా తాయారు చేశారన్న ఆయన..రాజశేఖర్ రెడ్డి పేరుతో రాజకీయ సొమ్ము చేసుకునేందుకు మాత్రమే షర్మిల వస్తుందన్నారు.