దారుణం.. భర్తను చంపి ఇంట్లో పూడ్చి పెట్టిన భార్య

దారుణం.. భర్తను చంపి ఇంట్లో పూడ్చి పెట్టిన భార్య

హైదరాబాద్: వనస్థలిపురంలో దారుణం జరిగింది. భర్తను చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టింది భార్య. పోలీసుల వివరాల ప్రకారం.. వనస్థలిపురం వివేకానంద నగర్ కాలనీలో గగన్ అగర్వాల్ (28) ఉంటున్నాడు. రెండేళ్ల క్రితం మొదటి భార్యకు విడాకులిచ్చిన గగన్ అగర్వాల్ గతేడాది జూన్ లో పాతబస్తీకి చెందిన నౌసిన్ బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఫిబ్రవరి 8న గగన్ మిస్సయినట్లు అతని భార్య నౌసిన్, గగన్  సోదరుడు  పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత నౌసిన్ తన ఇంటికి తాళం వేసి పుట్టింటికి వెళ్లింది.  పోలీసులు నౌసిన్ ను విచారించగా అసలు నిజం బయట పెట్టింది. తన భర్తను తానే చంపినట్లు చెప్పింది. ఫిబ్రవరి 6న గగన్ తన స్నేహితుడు సునీల్, భార్య నౌహిర బేగంతో కలిసి పార్టీ చేసుకున్నారు.  పార్టీ మధ్యలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో గగన్ అగర్వాల్ ను  భార్య నౌషీరా బేగం హత్య చేసింది. కత్తితో గగన్ ను గొంతు, ముఖంపై విచక్షణారహితంగా దాడి చేసింది. దీంతో గగన్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ తరువాత  ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ కోసం తవ్విన గుంతలో గగన్ ను పాతి పెట్టింది. విచారణలో సునీల్ తో కలిసి గగన్ ను చంపినట్లు ఒప్పుకుంది నౌషీరా.  సునీల్ తో పాటు నౌషీరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గగన్ ను ఎందుకు చంపాల్సి వచ్చిందో ఆరా తీస్తున్నారు . రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ టీంతో మృతదేహాన్ని బయటకు తీస్తున్నామని చెప్పారు.