పెళ్లీడుకొచ్చిన యువకులు.. వివాహం చేసుకొని భార్యతో సుఖ, సంతోషాలతో ఉండాలని కలలు కంటారు. అయితే ఓ యువకుడు అంతే ఆనందంతో ఇటీవల ఓ యువతిని పెళ్లిళ్ల బ్రోకర్ కుదిర్చిన సంబంధం చేసుకొని కష్టాల పాలయ్యాడు. తీగ లాగితే డొంక కదిలినట్టు ఆ కిలాడీ లేడీ 27 మందిని పెళ్లి చేసుకుంది. భర్తలందరూ తమ భార్య అదృశ్యమయిందిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆ కిలాడీ లేడీ భాగోతం బహిర్గతమైంది.
జమ్మూ కాశ్మీర్ రాజౌరీకి చెందిన మహిళ, పెళ్లి సాకుతో 27 మందికి పైగా పురుషులను మోసం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. 27 మంది పురుషులు తమ భార్యలు తప్పిపోయారంటూ కంప్లైంట్ ఇవ్వడానికి కాశ్మీర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. వీరు సబ్మిట్ చేసిన ఫోటోలన్నింటిలో ఉన్నది ఒకే మహిళ కావడం విశేషం.
బాధితుల్లో ఒకరు దీనికి సంబంధించి చెప్పిన విషయాలు ఇలా ఉన్నాయి. తన కుమారుడికి శారీరక సమస్యలు ఉన్నందున, పెళ్లి కోసం తాము ఓ బ్రోకర్కు 2 లక్షల రూపాయిలు చెల్లించామని బాధితుడి తండ్రి చెప్పాడు. తరువాత.. వారు కుటుంబంతో పాటు కొంతమంది బంధువులు రాజౌరికి చేరుకుని హోటల్లో బస చేశారు. అప్పుడు మధ్యవర్తి పెళ్లి సంబంధం కుదిర్చేందుకు ఆలస్యం చేయడంతో.. బాధితులు మధ్యవర్తిని నిలదీశారు. అప్సుడు అమ్మాయికి యాక్సిడెంట్ అయిందని డబ్బులో సగం తిరిగి ఇచ్చారు. మరల కొన్ని గంటల మరొక అమ్మాయి ఫోటోగ్రాఫ్లను తమకు చూపించారని బాధితులు తెలిపారు. పెళ్లికి అంగీకరించినప్పుడు మహిళను తీసుకువచ్చారని అని బాధితుడి తండ్రి అబ్దుల్ అహద్ మీర్ చెప్పారు.
పెళ్లి చేసుకోవడం.. పరారవడం..
అదే రాత్రి ఆ కుటుంబం కాశ్మీర్కు తిరిగి వచ్చింది. కొన్ని రోజులకు వివాహం చేసుకుంది. రెండు రోజుల తరువాత ఆ మహిళ తాను హెల్త్ చెకప్ చేయించుకోవాలని భర్తకు తెలిపింది. దీంతో ఆమె భర్త ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అపాయింట్మెంట్ బుక్ చేయడానికి అతను వెళ్ళినప్పుడు, కొత్త వధువు అక్కడి నుండి అదృశ్యమైంది. సదరు మహిళ కోసం ఐదు లక్షలకు పైగా విలువైన బంగారాన్ని తీసుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది.
మరో బాధితుడి సోదరుడు మాట్లాడుతూ, రాత్రి సమయంలో ఆ మహిళను మధ్యవర్తి తమకు చూపించారని, అదే సమయంలో నికాహ్ నిర్వహించారని చెప్పారు. ఆమె చదూర బుద్గాంలో పది రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత ఆమె ఆసుపత్రి నుండి పరారయిందని అతను చెప్పాడు. సెంట్రల్ కాశ్మీర్లోని బుద్గామ్లో నివసిస్తున్న మరో బాధితుడు మహ్మద్ అల్తాఫ్ మీర్, తనకు కూడా అదే మహిళతో వివాహమైందని చెప్పాడు. అయి తేఆ మహిళ అసలు పేరు ఎప్పుడూ వెల్లడించలేదని, ఒక రాత్రి ఇంట్లో ఉన్న వస్తువులతో మహిళ ఇంటి నుండి అదృశ్యమైందని చెప్పాడు.