వైన్ షాపులకూ టైమింగ్స్ కేటాయించిన ప్రభుత్వం

వైన్ షాపులకూ టైమింగ్స్ కేటాయించిన ప్రభుత్వం

బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా లాక్​డౌన్​ అమలులోకి రానుంది. ఈ సమయంలో వైన్ షాపులు కూడా మూతపడతాయని భావించిని వినియోగదారులు.. వైన్ షాపుల వద్ద ఎగబడతున్నారు. అయితే మద్యాన్ని డోర్ డెలివరీ చేయడానికి అనుమతులివ్వాలని డిస్టిలరీ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరింది. వైన్ షాపులు మూసివేస్తే ఆర్థికంగా ప్రభుత్వానికి కూడా నష్టం వాటిల్లుతుంది. దాంతో ఈ విషయాలన్నీ పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. వైన్ షాపులను ఉదయం 6 నుంచి 10 గంటల వరకు తెరిచి ఉంచాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అబ్కారీ శాఖకు ప్రాథమికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా అబ్కారీ కార్యాలయాలు కూడా ఉదయం 8 నుంచి 10 గంటల వరకు తెరచి ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఏపీలో కూడా ఉదయమే మద్యం దుకాణాలను తెరుస్తున్నారు. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో లాక్​డౌన్​ ఖరారైంది. అయితే లాక్​డౌన్​లో నిత్యావసరాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా తెరిచి ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం దుకాణాలతో ఆదాయం తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సైతం ఖరారు చేస్తోంది. పాలు, కూరగాయల దుకాణాలతో పాటుగా మద్యం దుకాణాలను కూడా ఉదయమే తెరిచి ఉంచుకోవాలని సూచిస్తోంది. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల తర్వాతే తెరుస్తుండగా… ఇప్పుడు ఉదయం 10 గంటల తర్వాత మూసివేయనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో మందుబాబులు లాక్​డౌన్​లో మద్యం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో లాక్​డౌన్​ ఉంటుందని చాలాచోట్ల నెలకు సరిపడా మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం లాక్​డౌన్​ నేపథ్యంలో మద్యం దుకాణాలు తెరచుకోవడానికి వెసులుబాటు కల్పించింది.