ఫోన్ మాట్లాడుతుందని..రీల్స్ చేస్తుందని..భార్యను హత్య చేశాడు

ఫోన్ మాట్లాడుతుందని..రీల్స్ చేస్తుందని..భార్యను హత్య చేశాడు

హైదరాబాద్: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి న్యూ భరత్ నగర్ లో మహిళా మర్డర్ కేసును 12 గంటల్లోనే ఉప్పల్ పోలీసులు చేదించారు. ఉప్పల్ లోని న్యూ భరత్ నగర్ లో ఐదు నెలలుగా ఓ హోటల్లో పనిచేస్తూ అద్దె ఇంట్లో ఉంటున్న మధు స్మిత, ప్రదీప్ బోలా దంపతులు జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు పడుతుండేవారు.ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడం రీల్స్ చేయడం, ఫోన్ తో గంటలు తరబడి ఉండడంతో ఆమె భర్త ప్రదీప్ బోలా అనుమానం పెంచుకున్నాడు. 

శుక్రవారం (జూలై12) అర్ధరాత్రి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి చపాతి పీటతో తలపై కొట్టడంతో మధుస్మిత స్పృహ కోల్పోయింది. ప్రదీప్ ఆమె మెడకు చున్నితో బిగించి హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్రూంలో బస్తా సంచిలో ఉంచి తాళం వేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. 
నాలుగు టీం లతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. బేగంపేట ఏరియాలో ప్రదీప్  ను అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు.  ప్రదీప్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించామని రాచకొండ, మల్కాజ్ గిరి ఏసీపీ చక్రపాణి తెలిపారు.