హైదరాబాద్: ప్రేమ పేరుతో డబ్బులు దండుకుంటున్న మహిళా కానిస్టేబుల్ ట్రాప్ నుండి రక్షించాలంటూ శంషాబాద్ డీసీపీ, షాబాద్ పోలీస్ స్టేషన్, సోషల్ మీడియా నంబర్లకు ఆన్ లైన్ లో పిర్యాదు చేశాడు బాధితుడు. పోలీస్ డిపార్ట్ మెంట్ పేరు చెప్పుకుంటూ డబ్బులు ఉన్నవారిని ట్రాప్ చేసి మోసం చేస్తుందని తెలిపాడు. ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో కానిస్టేబుల్ గా డ్యూటీ చేస్తున్న మహిళా కానిస్టేబుల్ మోసం చేసి గతంలో ముగ్గురిని పెళ్లాడిందని..అందులో ఇద్దరికి విడాకులు ఇవ్వగా, మరొకరు కానిస్టేబుల్ వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపాడు.
ఇప్పుడు షాబాద్ మండలం, హైతబాద్ కు చెందిన నన్ను ట్రాప్ చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ వచ్చిన నన్ను ప్రేమ పేరుతో వచించి పెళ్లి చేసుకుందన్నాడు. పెళ్లి చేసుకోక పోతే.. ST, SC అట్రాసిటీ కేసు పెడతానని, లేకపోతే కలిసి తిరిగిన ఫోటోలు వీడియోస్ బయటపెడ్తానని బెదిరింపులకు పాల్పడిందన్నాడు. గత వివాహాల విషయం తెలికుండా నమ్మబలికించి తనను పెళ్లి చేసుకుందని.. ఇలాగే ఎంతో మందిని మోసం చేస్తున్న మహిళా కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు.