అదనపు కట్నం కోసం వేధింపులు

అదనపు కట్నం కోసం వేధింపులు

సికింద్రాబాద్: అదనపు కట్నం కోసం భర్త, అత్త మామలు వేధిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది ఓ మహిళ. సికింద్రాబాద్, అడ్డగుట్టకు చెందిన ఆమెకు ఐదేళ్ల క్రితం పెళ్లయ్యిందని.. అప్పటి నుంచి  అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి తనను భర్త, అత్తమామలు ఇంటి నుండి బయటకు గెంటేశారని తెలిపింది.

ప్రస్తుతం తనకు 4 ఏళ్ల కొడుకు ఉన్నాడని.. అయినప్పటికీ .. అత్తామామలు, భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారని కన్నీరుమున్నీరైంది. రాత్రి నుండి కొడుకుతో ఇంటిముందు బైటాయించిన మహిళ..కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగింది. విషయం తెలుసుకున్న తుకారం గేట్ పోలీసులు  సంఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలను అడిగి తెలుసుకుంటున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది