V6 News

గుండెపోటుతో మహిళ మృతి.. సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

గుండెపోటుతో మహిళ మృతి..  సీపీఆర్ చేసినా దక్కని ప్రాణం

బషీర్​బాగ్, వెలుగు: గుండెపోటుతో మహిళ మృతి చెందిన ఘటన నారాయణగూడ పీఎస్ పరిధిలో జరిగింది.  నారాయణగూడ అడ్మిన్ ఎస్సై నరేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్​పేటకు చెందిన లాయర్ జైపాల్​రెడ్డి పెద్ద కుమార్తె (27) లహరికి హిమాయత్ నగర్ ప్రాంతానికి చెందిన వల్లభ్ రెడ్డితో గతేడాది ఏప్రిల్‌‌లో పెండ్లి జరిగింది. శుక్రవారం ఉదయం 9 గంటలకు  జైపాల్ రెడ్డి హైకోర్టుకు బయలుదేరాడు. మార్గమధ్యలో భార్య అతడికి ఫోన్ చేసింది.  కూతురు లహరి అత్తగారింట్లో కళ్లు తిరిగి పడిపోతే హాస్పిటల్​లో చేర్చించారని చెప్పింది.  వెంటనే జైపాల్ రెడ్డి హాస్పిటల్​కు వెళ్లాడు. పల్స్ రేట్ తగ్గడంతో ఉదయం 11 గంటలకు లహరి గుండెపోటుతో చనిపోయిందనిడాక్టర్లు తెలిపారు. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 సీపీఆర్ చేసిన దక్కని ప్రాణం..

సికింద్రాబాద్​: రాజ్​భవన్ ​రోడ్​లో శుక్రవారం ఓ వ్యక్తి గుండెపోటుకు గురై స్పృహ తప్పి పడిపోయాడు. విషయాన్ని గుర్తించిన బల్దియా డీఆర్ఎఫ్​ సిబ్బంది శివకుమార్​ వెంటనే సదరు వ్యక్తికి సీపీఆర్​ చేసి స్పృహలోకి తీసుకొచ్చాడు.ఆ తర్వాత అతడిని అంబులెన్స్​లో దగ్గరలోని హాస్పిటల్​కు తరలించారు. హాస్పిటల్​కు వెళ్లిన15 నిమిషాల వరకు పల్స్ ​బాగానే ఉన్నా.. తర్వాత పల్స్ రేట్ పడిపోవడంతో సదరు వ్యక్తి గుండె
పోటుతో చనిపోయాడు.