టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ

టీఆర్ఎస్ ఎమ్మెల్యేను నిలదీసిన మహిళ

ఐదేండ్లు పట్టించుకోలే.. ఎన్నికలొస్తే గుర్తొచ్చినమా?

చిన్నయ్యను నిలదీసిన బెల్లంపల్లి మహిళలు

బెల్లంపల్లి, వెలుగు:  ‘‘ఐదేళ్లు ఎమ్మెల్యేగా పని చేసిన్రు. ఇప్పటిదాక మా సమస్యలు పట్టించుకోలే. ఇప్పుడు ఎన్నికలొచ్చినయని ఓట్ల కోసం వచ్చి.. అభివృద్ధి మాట మాట్లాడుతున్నరు. ఎట్ల నమ్ముడు’’ అని ఓ మహిళ.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను నిలదీశారు. సోమవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా 9వ వార్డులో మహిళా ఓటర్లు కొందరు ఎమ్మెల్యేను సమస్యలపై నిలదీసి అభివృద్ధి ఏడుదంటూ ప్రశ్నించారు. దీంతో అవాక్కయిన ఎమ్మెల్యే చిన్నయ్య.. అభివృద్ధి చేస్తున్నామని, మీ సమస్యలు పరిష్కరిస్తామని వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. అందుకు వారు.. మాయమాటలు, అబద్ధాలు చెప్పవద్దని,  టీఆర్​ఎస్​కు ఓట్లు వేసే ముచ్చటే లేదని చెప్పడంతో  ఎమ్మెల్యే తో పాటు ఇతర నాయకులు ప్రచారం ఆపేసి వెనుదిరిగారు. దీంతో.. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో ఇంకెలా ఉండనుందో అని లోకల్ టీఆర్​ఎస్ నేతల్లో ఈ ఘటన చర్చనీయాంశమైందని తెలిసింది.