మద్యం మత్తులో యువకుల డ్రైవింగ్.. మహిళ మృతి

మద్యం మత్తులో యువకుల డ్రైవింగ్.. మహిళ మృతి

జీడిమెట్ల, వెలుగు: జాతీయ రహదారి కొంపల్లి వద్ద ఓ ఇన్నోవా కార్ బీభత్సం సృష్టించింది . మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టడంతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది . మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొత్తం ఏడు వాహనాలు ధ్వంసమయ్యాయి. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు కథనం ప్రకారం… మంగళవారం రాత్రి ఏపీ 09సీఎం 4366 నంబరు గల ఇన్నోవా వాహనం సుచిత్ర వైపు నుంచి కొంపల్లి వస్తోంది . ఈ క్రమంలో మేడ్చల్ జిల్లా రవాణాశాఖ కార్యాలయం ముం దు రోడ్డుపై ఇన్నోవా వాహనం అదపుతప్పి పక్కనే ఉన్న సర్వీస్ రోడ్డులోకి దూసుకు వచ్చింది . ఆ సమయంలో ఎదురుగా స్కూటీ  పై వస్తున్న శ్రీదేవి(27) ను ఢీ కొట్టింది . దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కేదారినాథ్ అనే
మరో వ్యక్తిని ఢీకొట్టగా స్వల్పగాయాలయ్యాయి. 5 కార్లు , 2 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి.
తీవ్రం గా గాయపడ్డ శ్రీదేవిని స్థానికంగా ఉన్నదవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించింది . ఈమె కొం పల్లికి చెంది న మహిళగా గుర్తించారు. ఈమెకు ఒక సంవత్సరం బాబు  ఉన్నట్లు సమాచారం. మద్యం మత్తులో ఇన్నోవా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిం దని ప్రత్యక్ష్య సాక్షులు తెలిపారు. యాక్సిడెం ట్ జరగ్గానే కారు వదిలి పరారయ్యారని చెప్పా రు.