అక్కడ వైన్ షాపులు తొలగించాలని ఆందోళన

అక్కడ వైన్ షాపులు తొలగించాలని ఆందోళన

హైదరాబాద్: ఎల్బీనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వైన్ షాపులను తొలగించాలని ఆందోళనకు దిగారు అక్కడి కాలనీ వాసులు. ఎల్బీనగర్ మన్సూరాబాద్  లోని బిగ్ బజార్ రూట్ లో కొత్తగా ఓ వైన్స్ ను ఏర్పాటు చేశారు. అయితే దాని పక్కనే ఇదివరకే…   వైన్స్ తో పాటు ఓ బారు ఉంది దీనితో వైన్స్ లు బార్ లు వరుసగా తయారయ్యాయి.  దీంతో అక్కడికి తాగటానికి వెళ్తున్న వారంతా రోడ్డుపై తమ వెహికిల్ లను అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో పాటు… తాగి నానా యాగి చేస్తున్నరు. అటువైపునుంచే వెళ్తున్న శ్రీ సాయి నగర్, సాయి సప్తగిరి కాలనీ, సాయి భవాని నగర్ ఇలా సుమారు 8 కాలనీలకు కాలనీలకు చెందిన మహిళలకు ప్రాబ్లమ్ ఏర్పడుతుందని ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానికంగా ఇబ్బంది కలిగిస్తున్న ఈ మధ్య దుకాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే ఇలాంటి వాటికి అధికారులు ఎలా పర్మిషన్ ఇస్తారని ప్రశ్నించారు. అధికారులు తక్షణమే స్పందించి… వరుసగా ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలను తొలగించాలని లేని పక్షంలో   కాలనీ మహిళలు అంతా కలిసి రోడ్డు ఎక్కాల్సి వస్తుందని హెచ్చరించారు.