శేరిలింగంపల్లి(హైదరాబాద్), వెలుగు: తనకు నచ్చిన వాడిని కాదని తల్లిదండ్రులు వేరే సంబంధాలు చూస్తున్నారని ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్న ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. మియాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. వరంగల్కు చెందిన వరప్రసాద్ కూతురు తన్మయి(31) మియాపూర్లో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తోంది. తమ్ముడితో కలిసి ఆర్బీఆర్ కాంప్లెక్స్లో ఉంటోంది. తను పనిచేసే చోట మరో ఫిజియోథెరపిస్ట్ను ఇష్టపడుతున్నట్లు, అతడినే పెళ్లి చేసుకుంటానని ఇటీవల తల్లిదండ్రులతో చెప్పింది. దీనికి తన్మయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. ఆమెకు వేరే సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూలేని టైంలో ఫ్యాన్కు ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది.
For More News..