ఎన్నికల్లో నేను పోటీ చేయట్లే: బాబూ మోహన్

ఎన్నికల్లో నేను పోటీ చేయట్లే: బాబూ మోహన్
  • ఎన్నికల్లో నేను పోటీ చేయట్లే
  •  బండి సంజయ్, కిషన్ రెడ్డికి ఫోన్ చేసినా ఎత్తట్లే: బాబూమోహన్

ఖైరతాబాద్, వెలుగు: బీజేపీ తరఫున14 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేశానన్నారు. ఎంపీ బండి సంజయ్ పాదయాత్రను అన్నీ తానై నిర్వహించానన్నారు. ‘‘మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేశా.. నాకు టికెట్ ఇవ్వకపోవడమేంటీ? అందోల్​లో జీరోగా ఉన్న బీజేపీని హైక్ చేశాను. నేను తప్పు చేయను. అబద్ధం చెప్పను. ఎవరి వద్దా లంచాలు తీసుకోను. నేను చెరువులను రక్షిస్తే.. నా టికెట్ గుంజుకున్న వ్యక్తి చెరువులను పూడ్చి ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నాడు” అని ఆయన ఫైర్ అయ్యారు.

 ‘‘ఆ బీజేపీ నాయకులు ఆహ్వానిస్తేనే పార్టీలోకి వచ్చా.. కనీసం నా తప్పేమిటో పార్టీ చెప్పాలిగా.. దసరా వరకు అంతా బాగానే ఉంది. ఆ తర్వాత స్టేట్ పార్టీ పాత, కొత్త అధ్యక్షులు బండి సంజయ్, కిషన్​రెడ్డి నా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. అందుకే మీడియా ద్వారా వారికి చెబుతున్నా. నాపై కొందరు కావాలని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. 

నా కొడుక్కు, నాకు మధ్య టికెట్ కోసం యుద్ధం అంటూ ఒక పేపరు, చానల్ లో కూడా వార్తలు వచ్చాయి. ఇలా ఏదో ఊహించి రాయడమేంటీ?’’ అని బాబూమోహన్ ప్రశ్నించారు. ‘‘అప్పట్లో దివంగత ఎన్టీఆర్ పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో వచ్చిన సంపాదననే ఎన్నికల్లో ఖర్చు చేస్తున్నాను. దీనిపై పార్టీ హైకమాండ్ స్పందనను బట్టి నా నిర్ణయం ఉంటుంది. పార్టీలో ఉండొచ్చు.. ఉండకపోవచ్చు..” అని ఆయన కామెంట్ చేశారు.