కలప డిపోలో అగ్ని ప్రమాదం

కలప డిపోలో అగ్ని ప్రమాదం

కోరుట్ల, వెలుగు : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని కాల్వగడ్డ గడిగురుజు ప్రాంతంలో ఉన్న సుఫియాన్  సామిల్ వుడ్ బేస్డ్ ఇండస్ట్రీ కలప డిపోలో బుధవారం తెల్లవారుజామున 2 గంటలకు భారీ అగ్ని ప్రమాదం జరిగింది.  బాధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. డిపో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగగా స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఫైరింజన్, పోలీస్  సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే డిపోలో ఉన్న కలప, కటింగ్​ మెషీన్లు పూర్తిగా కాలిపోయాయి.

ఫైర్​ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, భారీగా ఆస్తినష్టం సంభవించిందని పోలీసులు తెలిపారు. అగ్ని ప్రమాదంలో భారీగా కలప, కటింగ్​ మెషీన్లు కాలిపోవడంతో  దాదాపు రూ. కోటి 50 లక్షల వరకు నష్టం వాటిల్లిందని సామిల్​ లీజ్  ఓనర్  జాకీర్ పాషా చెప్పాడు. విద్యుత్​ షార్ట్  సర్క్యూటే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్  డిపోను పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కిరణ్​ కుమార్​ తెలిపారు.