పరిహారం ఇచ్చాకే పనులు మొదలుపెట్టాలంటూ...

పరిహారం ఇచ్చాకే పనులు మొదలుపెట్టాలంటూ...

నల్గొండ జిల్లా పెద్దవూర మండలం  సుంకిశాల ఇంటెక్ వెల్ పంపిగ్ స్టేషన్...భూ నిర్వాసితులు వినూత్న నిరసన చేశారు. పంపింగ్ స్టేషన్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి కేటీఆర్ కు కనిపించేలా..ముందుగా నష్టపరిహారం ఇవ్వాలంటూ రోడ్లకు ఇరువైపులా  ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కోల్పోయిన భూములకు డబ్బులు ఇచ్చాకే పనులు మొదలు పెట్టాలన్నారు. దీంతో అలెర్ట్ అయిన పోలీసులు.. రైతులను, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ముందస్తుగా అరెస్ట్ చేశారు.