అధికారుల నిర్లక్ష్యం : ఇంద్రకీలాద్రిపై కార్మికుడు మృతి

అధికారుల నిర్లక్ష్యం : ఇంద్రకీలాద్రిపై కార్మికుడు మృతి

విజయవాడ: దేవీ నవరాత్రుల సందర్భంగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి ఆలయంలో పాత గోపురం నిర్మిస్తుండగా ఓ కార్మికుడు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన బుధవారం రాత్రి జరిగింది. కార్మికుడిని వెస్ట్ బెంగాల్ కు చెందిన జయదీప్ గా గుర్తించారు. అయితే ఆలయంలో పడి ఉన్న మృతుడి రక్తపు మరకలును శుభ్రపరచకుండా..వాటిపై ఆలయ సిబ్బంది ఇసుక పోశారు.

ఇది తెలియని భక్తులు రక్తపు మరకలను తొక్కుకుంటూ ఆలయంలోకి ప్రవేశిస్తున్నారు. ప్రమాదంపై గోప్యత పాటిస్తున్న కాంట్రాక్టర్ , అధికారులు… కార్మికుల విషయంలో ఎటువంటి భద్రతాప్రమాణాలు లేకపొవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ సీరియస్ అవుతున్నారు భక్తులు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.