బర్కత్ పురాలో ‘యాదాద్రి భవన్’ ప్రారంభం

బర్కత్ పురాలో ‘యాదాద్రి భవన్’ ప్రారంభం

యాదాద్రి ఆలయ సమాచారం కోసం హైదరాబాద్ బర్కత్ పురాలో యాదాద్రి భవన్ ప్రారంభించారు మంత్రులు. ఈ కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని, జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రమణాచారి పాల్గొన్నారు. 8 కోట్ల రూపాయల వ్యయంతో యాదాద్రి భవన్ నిర్మించామన్నారు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. యాదాద్రి ఆలయానికి సంబంధించిన ఆర్జిత సేవలు, కల్యాణం, గదుల బుకింగ్ ఇక్కడి నుంచే చేసుకునేలా సదుపాయం కల్పించామన్నారు.