8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి భువనగిరి : యాదాద్రిలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలను వైభవంగా నిర్వహించి ఉత్సవ ప్రాధాన్యతను పెంచేందుకు కృషి చేస్తున్నట్లు యాదాద్రి ఆలయ అధికారులు తెలిపారు.

మంగళవారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతు.. “మరో మూడు రోజుల్లో యాదాద్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఏర్పాట్లు ఊపందుకున్నాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉదయం వేళల్లో అలంకారసేవలు, రాత్రి వేళల్లో శ్రీవారి వాహనసేవలు ప్రతీ రోజు జరుగుతాయన్నారు. రాష్ట్ర గవర్నర్ ఈఎల్‌ఎన్ నరసింహన్ విశిష్ట అతిధిగా 15న ఉదయం కళ్యాణోత్సవానికి హాజరుకానున్నట్లు ఆమె తెలిపారు.