
యాదాద్రి, వెలుగు : పశువులను తరలించడానికి, వాటిని వధించడానికి వెటర్నరీ డాక్టర్ల అనుమతి తీసుకోవాలని కలెక్టర్హనుమంతరావు సూచించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన శాంతి సంఘం సమావేశంలో ఆయన మాట్లాడారు. బక్రీద్ పండుగ దృష్ట్యా వెటర్నరీ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించారు.
ఫిర్యాదులు వచ్చిన వెంటనే క్షేత్రస్థాయికి వెళ్లి శాంతి భద్రతల సమస్యలు పరిష్కరించాలన్నారు. చెక్ పోస్ట్ ల వద్ద రెవెన్యూ పోలీస్ వెటర్నరీ అధికారులు నిరంతరం నిఘా పెట్టాలన్నారు. ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా అధికారులు పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.