యాదాద్రి, వెలుగు : పంటల సాగులో నానో యూరియా, ఇతర పురుగు మందులు చల్లడం కోసం డ్రోన్ల వినియోగంపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా యాదాద్రి జిల్లాకు 10 డ్రోన్లు మంజూరు చేసింది. వీటిని 40 శాతం సబ్సిడీతో కో ఆపరేటీవ్ సొసైటీలు, ఫార్మర్ ప్రొడక్ట్ ఆర్గనైజషన్ల(ఎఫ్పీవో)కు అందించనుంది. దీంతో తొలి విడతగా మూడు డ్రోన్లను తీసుకొని ఉపయోగించిన తర్వాతే ఆర్డర్ వ్యవసాయ శాఖ మిగిలిన వాటికి ఆర్డర్ ఇవ్వనుంది. ఇవ్వనున్నారు.
ఇందుకోసం అగ్రికల్చర్ కమిషనరేట్ 8 సంస్థలను సూచించింది. దీంతో ఇప్పటివరకూ డ్రోన్లు సరఫరా చేసే మూడు సంస్థల ప్రతినిధులతో డీఏవో వెంకట రమణారెడ్డి చర్చలు జరిపారు. తక్కువ మొత్తంలో బెస్ట్ ప్రొడక్ట్ ఎవరు ఇస్తే ఆ సంస్థను ఎంపిక చేస్తామని డీఏవో చెప్పారు.
