యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

యాదాద్రికి పోటెత్తిన భక్తులు 

యాదగిరి గుట్ట లక్ష్మీ నరసింహాస్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక మాసం, ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో వస్తున్నారు. సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా క్యూ కట్టారు. 

మరోవైపు శ్రీశైలం ఆలయానికి భక్తులు పొటెత్తారు. పాతాళగంగలో స్నానాలు చేసి దర్శనానికి వెళ్తున్నారు. గంగాధర మండపం, ఉత్తర శివమాడ వీధిలో కార్తీక దీపాలు వెగలిగిస్తున్నారు. భక్తుల రద్దీతో స్వామివారి అలంకార దర్శనానికే అధికారులు అనుమతిస్తున్నారు. స్వామివారి దర్శనానికి నాలుగు గంటల టైం పడుతోంది. ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో ట్రాఫిక్ జామ్ అయింది.