యాగం అరిష్టాలను తొలగిస్తుంది : గవర్నర్ తమిళిసై

యాగం అరిష్టాలను తొలగిస్తుంది :   గవర్నర్ తమిళిసై

ముషీరాబాద్, వెలుగు: కాశీ కాలభైరవ కల్యాణంతో సమాజంలో నెలకొన్న అరిష్టాలు తొలగిపోయి మంచి జరుగుతుందని గవర్నర్ తమిళిసై అన్నారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి ప్రత్యంగిరా మహాయాగంలో భాగంగా శనివారం కాశీ కాలభైరవ కల్యాణం  కనుల పండువగా జరిగింది.

చీఫ్ గెస్టుగా హాజరైన గవర్నర్ తమిళిసై, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..  కాశీ కాలభైరవ కల్యాణంలో పాల్గొన్న భక్తులకు అన్ని విధాలుగా మేలు జరుగుతుందన్నారు. యాగంలో పాల్గొనే అదృష్టం రావడం సంతోషంగా ఉందన్నారు.  కార్యక్రమంలో పీఠం ప్రతినిధులు, భక్తులు భారీగా పాల్గొన్నారు.