ముంబై: టీమిండియాకు ఆడాలన్న తన కల ఎట్టకేలకు నెరవేరిందని వెస్టిండీస్తో రెండు టెస్ట్లకు ఎంపికైన యంగ్స్టర్ యశస్వి జైస్వాల్ అన్నాడు. గత పదేళ్లుగా తాను పడిన శ్రమకు ఇప్పుడు ప్రతిఫలం లభించిందన్నాడు. ‘నేను ఇండియా టీమ్ ఎంపికయ్యానని తెలిసినప్పుడు మా నాన్న ఏడవడం మొదలుపెట్టాడు.
ఇదంతా ఓ కలగా అనిపించింది. ప్రతి విషయాన్ని నేను చాలా సింపుల్గా చూస్తా. క్రమశిక్షణతో వ్యవహరిస్తా. మరో రెండు రోజుల్లో ఎన్సీఏకు వెళ్తా. విండీస్లో రాణించేందుకు నా శక్తి మేరకు కృషి చేస్తా’ అని జైస్వాల్ పేర్కొన్నాడు.