కేంద్ర ఎన్నికల సంఘానికి విజయ సాయి రెడ్డి లేఖ

కేంద్ర ఎన్నికల సంఘానికి విజయ సాయి రెడ్డి లేఖ

ఏప్రిల్ 11 న ఏపీలో జరిగిన ఎన్నికలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలు పార్టీలకు చెందిన నాయకులు ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమీషన్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయంపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈవిఎంలు మొరాయించాయని, కొన్నిచోట్ల రిగ్గింగ్ జరిగిందనే అనుమానం కూడా ఉందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా కేంద్రానికి లేఖ రాశారు. ఈవీఎంల రక్షణకు కేంద్ర బలగాలను వినియోగించాలని..స్ట్రాంగ్ రూమ్ ల దగ్గర సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను మొహరించాలని, అన్ని స్ట్రాంగ్ రూమ్ లలో 24 గంటలు సీసీ టీవీ కెమెరాలు పనిచేసేలా అమర్చాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులకు బదులుగా కేంద్ర పోలీసులనే స్ట్రాంగ్ రూమ్ ల వద్ద కాపలాగా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.