విశాఖలో ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన కార్యక్రమాలు

విశాఖలో ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన కార్యక్రమాలు

ఇవాళ విశాఖలో పొలిటికల్ హీట్ పెరగనుంది. ఒకే రోజు వైసీపీ, టీడీపీ, జనసేన మూడు కార్యక్రమాలు చేపట్టాయి. విశాఖ గర్జన కోసం వైసీపీ సర్వం సన్నద్ధం చేసింది. లక్ష మంది 3.4 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. ఈ పాదయత్రలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదారావు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రోజా, రజినీ, కొడాలి నాని, రాజన్న దొర, ముత్యాల నాయుడు, సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పోరేటర్లు, జేఏసీ సభ్యులు, వివిధ సంఘాల నేతలు పాల్లొనున్నారు.

మరోవైపు జనసేన సైతం ఇవాళే కార్యక్రమాన్ని చేపట్టనుంది. విశాఖలో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇప్పటికే విశాఖలో జనసేన నేత నాగబాబు బస చేశారు. పవన్ కళ్యాణ్ పర్యటన ఏర్పాట్లను జనసేన నేత నాగబాబు పరిశీలించనున్నారు. నేడు మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ రానున్నారు. ఉత్తరాంధ్ర నేతలతో పవన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఇక విశాఖ గర్జనకు పోటీగా టీడీపీ సేవ్ ఉత్తరాంధ్ర సమావేశం జరగనుంది. విశాఖకు ఉత్తరాంధ్ర, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు చేరుకుంటున్నారు.పోటాపోటీ కార్యక్రమాలతో విశాఖలో టెన్షన్ వాతావరణం నెలకొంది. మూడు పార్టీ కార్యక్రమాలతో పోలీసుల అలర్ట్ అయ్యారు. విశాఖలో పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.